ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..
ABN , Publish Date - Jun 18 , 2025 | 05:48 AM
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్
న్యూఢిల్లీ, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఆ దేశాల్లో నివసిస్తున్న, ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులు సహాయం కోసం హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించింది.
సహాయం కోసం రెసిడెంట్ కమిషనర్ పీఎస్ వందన(+91 9871999044), లైజన్ ఆఫీసర్లు రక్షిత్ నాయక్(+91 9643723157), జావేద్ హుస్సేన్ (+91 9910014749), పౌర సంబంధాల అధికారి సీహెచ్ చక్రవర్తి(+91 9949351270)లను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.