Share News

Insurance Scheme: అర్చకులకు ఇన్సూరెన్స్‌ పథకం!

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:22 AM

అర్చకులకు ఇన్సూరెన్స్‌ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్‌ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు.

Insurance Scheme: అర్చకులకు ఇన్సూరెన్స్‌ పథకం!

  • ప్రభుత్వంతో కొనసాగుతున్న సంప్రదింపులు: అర్చక జేఏసీ

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్చకులకు ఇన్సూరెన్స్‌ పథకం తీసుకురావాలని, ఈ మేరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలంగాణ అర్చక సమాఖ్య జేఏసీ చైర్మన్‌ గంగ ఉపేంద్ర శర్మ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో అర్చక సమస్యలపై జరిగిన పోరాటాల ఫలితంగానే ధూప, దీప, నైవేద్యం పథకం అమలులోకి వచ్చిందన్నారు. 65-ఎ ద్వారా వేతనాలు సాధించామని, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా చిన్న అర్చకులకు ప్రయోజనం చేకూర్చామని తెలిపారు. హైదరాబాద్‌లో తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అర్చకుల హక్కులు, సంక్షేమం, ఆలయాల అభివృద్ధిపై పలు తీర్మానాలు ఆమోదం పొందాయి.

Updated Date - Aug 25 , 2025 | 04:22 AM