నాటుసారా వ్రియిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:21 AM
నాటుసారా విక్రయిస్తే కఠినచర్య లు తీసుకుంటామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.కిషన అన్నారు.
నాటుసారా వ్రియిస్తే కఠిన చర్యలు
ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో విసృతంగా దాడులు
10 లీటర్ల నాటుసారా స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
దేవరకొండ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): నాటుసారా విక్రయిస్తే కఠినచర్య లు తీసుకుంటామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.కిషన అన్నారు. నల్లగొండ ఏఈఎస్ ఆధ్వర్యంలో శనివారం దేవరకొండ సీఐ శ్రీనివాస్, నల్లగొండ ఎనఫోర్స్మెంట్ పోలీసులు మూకుమ్మడిగా సర్కిల్ పరిధిలోని ఎడ్లగడ్డతండా, డిండి, ప్రతా్పనగర్లలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. నా టుసారా విక్రయిస్తున్న మూడావత కళమ్మ, రమావత రాజమ్మను అరెస్ట్ చే సి వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా, 60 కేజీల బెల్లం, 10 కేజీల పట్టిక స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎక్సైజ్ సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో 900లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ దా డుల్లో ఎస్ఐలు వీరబాబు, నర్సింహ, మల్లేష్, నర్సింగ్రావు పాల్గొన్నారు.