క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంపొందించవచ్చు
ABN , Publish Date - Jan 17 , 2025 | 01:04 AM
క్రీడ లతో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిం చవ చ్చునని ఎస్పీ అశోక్కుమార్ పేర్కొన్నారు.

ఎస్పీ అశోక్ కుమార్
ఘనంగా ప్రారంభమైన పోలీస్ వార్షిక క్రీడలు
పోటీలను ప్రారంభించిన ఎస్పీ
జగిత్యాల క్రైం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) :క్రీడ లతో మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందిం చవ చ్చునని ఎస్పీ అశోక్కుమార్ పేర్కొన్నారు. పోలీస్ ప రేడ్ మైదానంలో శాంతి భద్రతల పరిరక్షణలో ని త్యం బిజిగా ఉండే పోలీస్ అధికారులు, సిబ్బందిలో నూతనోత్సాహాన్ని నింపడం కోసం నిర్వహిస్తున్న పో లీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025ను గురువారం ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పో లీస్ అధికారులు, సిబ్బంది మార్చ్ పాస్ట్ నిర్వహించ గా ఎస్పీ క్రీడా జ్యోతి వెలిగించి వాలీబాల్, రన్నింగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో స్నేహ భావం పొందడంతో పాటు పని ఒత్తిడి నుంచి రిలీ ఫ్ అవడానికి ఉపయోగపడుతాయన్నారు. క్రీడలతో పోటీతత్వం పెంపొందండంతో పాటు ప్రతిభను తెలి యజేస్తుందన్నారు. గెలుపోటములు సహజమైన ప్ప టికి ప్రతి ఒక్కరూ పోటీల్లో పాల్గొని తమ క్రీడా స్ఫూ ర్తి చాటుకోవాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పా టు నిర్వహించనున్న స్పోర్ట్స్ మీట్లో మొదటి రోజు వాలీబాల్, క్రికేట్, కబడ్డీ, బ్యాట్మెంటన్, అథ్లెటిక్, క్యా రం, చెస్ పోటీల్లో పలువురు తమ ప్రతిభను చా టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘ చందర్, రాములు రంగారెడ్డి, ఏవో శ శికళ, ఇన్స్ఫెక్టర్లు శ్రీనివాస్, ఆరీఫ్అలీ ఖాన్, రఫీఖా న్ సీఐలు వేణు గోపాల్, రాంనర్సింహారెడ్డి, నిరంజన్ రెడ్డి, రవి, కృష్ణారెడ్డి, సురేష్, ఆర్ఐలు కిరణ్ కుమార్, వేణు, రామకృష్ణ ఉన్నారు.