సంక్షేమ పథకాలు భేష్
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:32 AM
సంక్షేమ పథకాల తీరు బాగున్నాయని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తమిళనాడు బృందం తెలిపింది. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బృందంసభ్యులు పర్యటించా రు. గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, గ్రంథాలయం, పల్లెప్రకృతి వనం,నర్సరీ, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తమిళనాడు బృందం
రామన్నపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి):సంక్షేమ పథకాల తీరు బాగున్నాయని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తమిళనాడు బృందం తెలిపింది. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో బృందంసభ్యులు పర్యటించా రు. గ్రామపంచాయతీ కార్యాలయం, రైతు వేదిక, గ్రంథాలయం, పల్లెప్రకృతి వనం,నర్సరీ, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న తీరును గమనించారు. మధ్యాహ్న భోజనపథకం అమలును పరిశీలించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తు న్న పథకాల అమలు బాగుందని, ప్రజలు వీటిని ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో డివిజినల్ పంచాయతీ అధికారి రవూఫ్ అలీ, ఆర్డబ్ల్యూఎస్ గ్రామ ప్రత్యేకాధికారి అశిష్ రాఘవ, ఏపీ వో పి.వెంకన్న, టెక్నికల్ అసిస్టెంట్ సుచరిత, పంచాయతీ కార్యదర్శి మోహన్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు