తిరువేంకటాదీశ.. నారసింహ
ABN , Publish Date - May 10 , 2025 | 12:21 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, సన్నాయి మేళాలతో ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు బృందం ఆలయంతో పాటు పరిసరాలను సంప్రోక్షణ చేశారు.

యాదగిరిగుట్ట, మే 9 (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలు ప్రధానాలయంతో పాటు పాతగుట్ట ఆలయంలో శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, సన్నాయి మేళాలతో ప్రధానాలయంలో నిత్యారాధనల అనంతరం ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు బృందం ఆలయంతో పాటు పరిసరాలను సంప్రోక్షణ చేశారు. స్వస్తివాచనంతో వేడుకలకు శ్రీకారం చుట్టి తొలుత విష్వక్సేనారాధన చేసి పుణ్యహవాచనం చేశారు. గర్భాలయానికి అభిముఖంగా లక్ష కుంకుమార్చన చేపట్టిన అర్చకులు స్వామివారిని తిరువేంకటపతిగా దివ్యమనోహరంగా అలంకరించి వేద పారాయణాలతో తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారికి జరిగిన ఈ వేడుకల్లో దేవాదాయ శాఖ డైరెక్టర్, ఈవో ఎస్ వెంకట్రావు, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి దంపతులు పాల్గొన్నారు. తొలుత భారత-పాక్ మధ్య ఆపరేషన సిందూర్ యుద్ధం జరుగుతున్నందున దేశానికి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా ప్రత్యేక సంకల్పన చేశారు. సాయంత్రం మృత్యంగ్రహణం నిర్వహించగా ఉత్తర తిరువీధిలోని ఏర్పాటుచేసిన యాగశాలలో అంకురారోపణ చేసి హవనం నిర్వహించారు. స్వామివారిని పరవాసుదేవుడిగా అంలకరణలో వేద పండితుల వేద పారాయణాలతో గరుడ వాహనంపై ఊరేగించారు. అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చండీహోమం చేపట్టిన పూజారులు ప్రత్యేక సంకల్పంతో హవనం చేపట్టారు. అదేవిధంగా పాతగుట్ట ఆలయంలో ఉదయం స్వస్తివాచనం, విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, లక్ష కుంకుమార్చనలు నిర్వహించగా సాయంత్రం మృత్యంగ్రహణం, అంకురోరపణ హవనం వైభవంగా కొనసాగాయి. కార్యక్రమాల్లో ఉప కార్యనిర్వహణధికారి దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీనకుమార్శర్మ, జూశెట్టి క్రిష్ణ, గజ్వేల్లి రఘు, పర్యవేక్షకులు నాగుల మహే్షగౌడ్, రామరావునాయక్, మాచర్ల రాజనబాబు, వాసం వెంకటేశ్వర్లు, శంకర్నాయక్, దాసోజు నరేష్, సివిల్ ఈఈ జిల్లెల దయాకర్రెడ్డి, ఏఈ శ్రీనివా్సరెడ్డి, ఎస్పీఎఫ్ ఇనస్పెక్టర్ కే. శేషగిరిరావు పాల్గొన్నారు.