మదర్ డెయిరీకి ప్రభుత్వం రూ.50కోట్లు ఇవ్వాలి
ABN , Publish Date - May 03 , 2025 | 12:31 AM
ఆలేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): మదర్డెయిరీని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50కోట్లు సాయం అందించాలని పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, కో కన్వీనర్ పెసర కాయల జంగారెడ్డి కోరారు.
ఆలేరు, మే 2 (ఆంధ్రజ్యోతి): మదర్డెయిరీని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50కోట్లు సాయం అందించాలని పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు, కో కన్వీనర్ పెసర కాయల జంగారెడ్డి కోరారు. శుక్రవారం వారు మదర్డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిని కలిసి పాడి రైతులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. మదర్డెయిరీ నష్టాల కూరుకుపోవడానికి గత పాలకుల తప్పిదాలే కారణమన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న రీసెంట్యూ డబ్బులను కూడా రైతుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజుగౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, నాయకులు మధుసూదన్రెడ్డి, పి.మహేం దర్ రెడ్డి, శివరాంరెడ్డి, బండి నాగయ్య, భాస్కర్ గౌడ్ పాల్గొన్నారు.