ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:14 AM
కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు.
కొండమల్లేపల్లి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని గ్రా మాల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31వ తేదీ వరకు చేపటిన ఉపాధి హామీ పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్కుమార్ ఆధ్వర్యంలో 4వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మం డలంలో సుమారు రూ.5.50 కోట్ల కింద జరిగిన పనులకు సంబ ంధించి పలు రికార్డులను పరిశీలించారు. జిల్లా అధికారులు ఈ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. తనిఖీ అనంతరం విజిలెన్స్ అధికారి వేణుగోపాలరావు మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సామాజిక తనిఖీ పరంగా గ్రామపంచాయతీల్లో విధు లు నిర్వహిఇంచే ఉద్యోగులు సరైన రికార్డులను ఏర్పాటు చేసు కోవా లని ఇప్పటివరకు ఈ మండలంలో పనిచేసే ఉద్యోగులపై దాదా పుగా 1,342 అభ్యంతరాలు ఉన్నాయని వాటికి సంబంధించిన ఉద్యోగుల సంజాయిషీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ తనిఖీలో అసిస్టెం ట్ క్లస్టర్ పీడీ యామిని, జిల్లా విజిలెన్స్ అధికారి వేణు గో పాలరావు, క్వాలిటి కంట్రోల్ ఫసియుద్దీన్, ఎంపీడీవో బాలరాజురెడ్డి, ఏపివో రామచంద్రనాయక్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, రాజు టెక్నికల్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.