ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ప్రారంభించాలి: డీవైఎఫ్ఐ
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:46 PM
జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే ప్రారంభించాలని డీవైఎ్ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భువనగిరి గంజ్, జూన 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను వెంటనే ప్రారంభించాలని డీవైఎ్ఫఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి ఇంటిగ్రేటెడ్ సమీకృత మార్కెట్ను సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ స్థానిక వ్యాపారుల కోసం గత ప్రభుత్వం నిర్మించిందని, ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం దానిని పట్టించుకోలేదని అన్నారు. తక్షణమే మార్కెట్ ప్రారంభించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఎ్ఫఐ సహాయ కార్యదర్శి ఎండీ.సలీం, షేక్ రియాజ్, నరేష్, ఎండీ సాజిద్, ఎండిసోహెల్, సయ్యద్ అమన పాల్గొన్నారు.