Share News

నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే జైలుకే

ABN , Publish Date - May 10 , 2025 | 12:20 AM

ప్రభు త్వ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే జైలుకు పంపిస్తానని మనుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దామెర లో రూర్బన్‌ మిషన్‌ నిధులు రూ.23లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే జైలుకే

అధికారులు, కాంట్రాక్టర్లపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం

చౌటుప్పల్‌రూరల్‌,మే 9(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే జైలుకు పంపిస్తానని మనుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని దామెర లో రూర్బన్‌ మిషన్‌ నిధులు రూ.23లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం భవన ని ర్మాణతీరును పరిశీలించారు. భవనం నాణ్యత ను చూసి పంచాయతీరాజ్‌ డీఈ బాలచంద్రం, భవననిర్మాణ కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం ప్రారంభానికి ముందే పగుళ్లు రావడం, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంపై మండిపడ్డారు. మీలాంటి అధికారులు, కాంట్రాకర్ల వల్ల ప్రభుత్వానికి చెడ్డపెరు వస్తుందన్నారు. మళ్లీ ఇలాంటి పనులు చేస్తే జైలుకు పంపిస్తా జాగ్రత్త అంటూ డీఈని హెచ్చరించారు. అక్కడ మిగిలిన కార్యక్రమాలు నిర్వహించకుండానే అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మునుగోడు సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు

చౌటుప్పల్‌ టౌన్‌: నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసినట్టు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌ పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను రాజగోపాల్‌ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రగతిలో ఉన్నాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్యపరచాలని కార్యకర్తలు, నాయకులను కోరారు. అంతకుముందు కస్తూర్బాగాంధీ బాలికల జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కస్తూర్బాగాంధీ జూనియర్‌ కళాశాలకు కేటాయించిన సర్వే నెం.171లో ప్రభుత్వ భూమిలో కబ్జాలను వెంటనే తొలగించాలని తహసీల్దార్‌ హరికృష్ణను ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, తహసీల్దార్‌ హరికృష్ణ, డీటీ పి.సిద్దార్థ్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పబ్బు రాజు, నాయకులు వెన్‌రెడ్డి రాజు, చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సుర్వి నర్సింహ, బి.మురళి, రమేష్‌ పాల్గొన్నారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

సంస్థాన్‌ నారాయణపురం: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరారు. మండలంలో శుక్రవా రం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగు కాల్వల పనులకు, ఎసీఎఫ్‌ నిధులు రూ.6.45లక్షలతో ఏర్పా టు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుత్తా ఉమాదేవి, నాయకులు మదుగుల బాలకృష్ణ, ఉప్పల లింగస్వామి, కరంటోతు శ్రీనునాయక్‌, ముద్దంగుల నర్సింహ, అక్బర్‌అలీ, పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 12:20 AM