విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN , Publish Date - May 10 , 2025 | 12:18 AM
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ ని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని జూలూరు పీఏసీఎస్ పరిధిలోని అలీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు.

కలెక్టర్ హనుమంతరావు
జూలూరు పీఏసీఎస్ సీఈవోను సస్పెండ్ చేసిన కలెక్టర్
భూదాన్పోచంపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవ ని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవా రం మండల పరిధిలోని జూలూరు పీఏసీఎస్ పరిధిలోని అలీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాఽథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) సీఈవో రెబ్బాస్ నర్సింహ అలీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న జూలూరు పీఏసీఎస్ సీఈవోపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే కాంటవేసి, లోడింగ్ చేసి, రైసు మిల్లులకు వెంటనే తరలించాలని సూచించారు. సీఈవో ఇటీవల అలీనగర్లో ఏర్పాటు చేసిన సెంటర్ను ఇప్పటిదాకా వచ్చి చూడలేదని రైతు లు చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీలను కూడా ఏర్పాటు చేయలేదని, జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది రానివ్వమన్నారు. జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో సరిపడా హమాలీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతీకేంద్రంలో రైతులకు తాగునీటి వస తి, రైతులకు ఎండ తగలకుండా టెంట్ ఏర్పా టు చేయాలని సూచించారు. జిల్లాలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.
‘భూ భారతి’తో భూసమస్యలు పరిష్కారం
ఆత్మకూరు(ఎం): భూ భారతి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కూరెళ్ల, కప్రాయిపల్లి గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ సదస్సులు జరిగాయి. కూరెళ్ల రెవెన్యూ సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ గ్రా మాల్లో నెలకొన్న భూసమస్యలు పరిష్కరించాల నే లక్ష్యంతో రెవెన్యూ అధికారులే రైతుల ముంగిటకు వస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలన్నారు. సాదాబైనామాలు, ఫౌతి లాంటి సమస్యలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసీల్దార్ వి.లావణ్య, డీటీ షఫీఉద్దీన్, ఆర్ఐ మల్లికార్జున్రావు, మాజీ సర్పంచ్ బాషబోయిన ఉప్పలయ్య, బి.పాపయ్య తదితరులు పాల్గొన్నారు.