ఘనంగా గోరింటాకు పండుగ
ABN , Publish Date - Jun 28 , 2025 | 12:25 AM
మండలకేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ సేవా మహిళా సంఘం సభ్యులు ఆషాఢమాసం గోరింటాకు పండుగను శుక్రవారం ఆనందోత్సవాల నడుమ వేడుకగా జరుపుకున్నారు.
మఠంపల్లి, జూన 27(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవీ సేవా మహిళా సంఘం సభ్యులు ఆషాఢమాసం గోరింటాకు పండుగను శుక్రవారం ఆనందోత్సవాల నడుమ వేడుకగా జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొని గోరింటాకు పెట్టుకున్నారు. వివిధ రకాల డిజైన్లను గోరింటాకుతో చేతులపై పెట్టుకొని సందడి చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు సంధ్యారాణి, ఉపాధ్యక్షులు చీదెళ్ల స్వాతి, కార్యదర్శులు వంగవేటి భూలక్ష్మి, కొత్తశ్యామల, వంగవేటి పద్మావతి, సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.