Share News

డిగ్రీ పరీక్షల్లో 27 మంది విద్యార్థుల డిబార్‌

ABN , Publish Date - May 26 , 2025 | 12:07 AM

నల్లగొండ, మే 25 (ఆంధజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో ఆదివారం మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడిన 27మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు.

డిగ్రీ పరీక్షల్లో 27 మంది విద్యార్థుల డిబార్‌

నల్లగొండ, మే 25 (ఆంధజ్యోతి): మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో ఆదివారం మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడిన 27మంది విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు జరిగిన రెండో సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,145 మంది విద్యార్ధులు హాజరు కావాల్సి ఉండగా 5,363 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో 16 మంది విద్యార్ధులు డిబారయ్యారు.నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లో 9మంది, దేవరకొండలో 4, మిర్యాలగూడలో ఒకరు, భు వనగిరిలో ఒకరు, రామన్నపేటలో ఒక్కరు చొప్పున డిబారయ్యారు. అలాగే మఽధ్యాహ్నం జరిగిన మూడో సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 2,152 మందికి గాను 1,898 హాజరుయ్యారు. ఇందులో 11మంది విద్యార్ధులను డిబార్‌ చేశారు. నల్లగొండలో 8 మంది, భువనగిరిలో ఒకరు, కోదాడ, మిర్యాలగూడలో ఒకరి చొప్పున డిబారయ్యారు.

Updated Date - May 26 , 2025 | 12:07 AM