Share News

MLA Harish Babu: పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే హరీశ్‌బాబు నిరవధిక నిరాహార దీక్ష

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:10 AM

పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని...

MLA Harish Babu: పోడు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే హరీశ్‌బాబు నిరవధిక నిరాహార దీక్ష

కాగజ్‌నగర్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూరు ఎమ్మెల్యే హరీశ్‌ బాబు సోమవారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోడు రైతుల సమస్యలను ఎన్నో సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా స్పందించడం లేదని చెప్పారు. జీవో 49ను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడేవరకు దీక్షను కొనసాగిస్తానన్నారు. అంతకుముందు ఆయన పోడు రైతుల సమస్య పరిష్కరించాలని కాగజ్‌నగర్‌ అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం చేపట్టగా.. ఉదయమే పోలీసులు హరీశ్‌ బాబును హౌస్‌ అరెస్టు చేశారు.

Updated Date - Aug 19 , 2025 | 04:10 AM