Surrogacy : అక్రమ సరోగసీ, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 02:08 PM
అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు మొత్తం 8 మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారని
మేడ్చల్, ఆగస్టు 15 : అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు మొత్తం 8 మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడ్డారని డీసీపీ తెలిపారు. పిల్లలు లేని జంటలను టార్గెట్ గా చేసుకుని నిందితులు 15- 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్గా పని చేసిన అనుభవం ఉందని .. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసి విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని డీసీపీ తెలిపారు.
లక్ష్మీ రెడ్డి కుమారుడు A2 నిందితుడు నరేందర్ రెడ్డి JNTU లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడని, అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడని డీసీపీ చెప్పారు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను టార్గెట్ గా చేసుకుని ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, సరోగసికి ఒప్పిస్తున్నారని, నిందితుల దగ్గర నుంచి 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీళ్ళిద్దరూ కొన్ని హాస్పిటల్స్ కు ఏజెంట్లకు పనిచేస్తున్నారని డీసీపీ తెలిపారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు.