మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - May 20 , 2025 | 11:21 PM
రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
మక్తల్, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లో అల్పాహారం చేసిన అనంతరం ఆయన వంట లను పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సీఎం రేవంత్రెడ్డి చెప్పిన విధంగా ప్రతీ మహిళను కోటీశ్వరురాలిని చేసే బాధ్యత మాదే అన్నారు. క్యాంటీన్ నిర్వాహకు రాలు మహాదేవమ్మ, కాంగ్రెస్ నాయకులు కట్ట వెంకటేష్, కల్లూరి హన్మంతు, రహీంపటేల్, సలాంబిన్ ఉమర్, శివరాంరెడ్డి, ఓబ్లేష్ ఉన్నారు.
ఎల్వోసీ అందజేత
ఊట్కూర్ : అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని పెద్దజట్రం గ్రామా నికి చెందిన పస్తు జయమ్మకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరయ్యాయి. మంజూరైన ఎల్వోసీని మంగళవారం మక్తల్లోని ఎమ్మెల్యే స్వగృహంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. పెద్ద జట్రం గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.