రైతులకు కష్టాలు రానివ్వం : చిన్నారెడ్డి
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:47 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి ఆపద రానివ్వమని ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చి న్నారెడ్డి అన్నారు.
రేవల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం లో రైతులకు ఎలాంటి ఆపద రానివ్వమని ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చి న్నారెడ్డి అన్నారు. గురువారం గోపాల్పేట మం డలంలోని జయన్న తిరుమలాపురంలో ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం ఆఽధ్వర్యం లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆ యన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లా డారు. రైతులకు ఏడాది కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాని కే దక్కిందన్నారు. వాతావరణ సూచన మేరకు ధాన్యం రాసుల వద్ద టార్పాలిన్లు అందుబాటు లో ఉంచుకోవాలని రైతులకు సూచించారు. రై తులు దళారులను నమ్మి మోసపొవద్దని ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సూ చించారు. ప్రవీణ్రెడ్డి, బొజ్జన్న, మన్నెమ్మ, లోకే శ్వర్రెడ్డి, బాలేశ్వర్, పర్వతాలు పాల్గొన్నారు.