భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - May 09 , 2025 | 10:57 PM
పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పో యే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా మని పేట ఆర్డీవో రాంచందర్ అన్నారు.

మక్తల్, మే 9 (ఆంధ్రజ్యోతి): పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పో యే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా మని పేట ఆర్డీవో రాంచందర్ అన్నారు. శుక్రవారం టేకులపల్లి, యర్నాగన్పల్లి, కాచ్వార్, కాట్రేవ్పల్లి గ్రామాల రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వారి అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూములు కోల్పోయే ప్రతీ రైతుకు ప్రభుత్వం నుంచి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. పలువురు రైతులు మా ట్లాడుతూ గతంలో భూత్పూర్ రిజర్వాయర్ కింద అనేకమంది రైతులు భూములు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. భూమి కోల్పోయే ప్రతీ రైతుకు సమానమైన భూమిని ప్రభుత్వం సేకరించి అప్పగించాలని లేకపోతే ఎకరాకు రూ.80 లక్షల వరకు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. తహసీల్దార్ సతీష్కుమార్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.