సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:05 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఉప యోగించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
- దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేసిన కలెక్టర్, ఎమ్మెల్యే
గద్వాల న్యూటౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఉప యోగించుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఐడీవోసీ సమావేశపు హాలులో మహిళ, శిశు సంక్షేమ, వయో, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అలిమ్కో సంస్థ ద్వారా జిల్లాలోని 93 మంది దివ్యాంగులకు రూ. 21.27 లక్షలలో 114 ట్రై సైకి ళ్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డితో కలిసి కలెక్టర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, జి ల్లా సంక్షేమాధికారి సునంద, ఆల్మికో ప్రతినిధి సునీతదాస్, దివ్యాంగులు ఉన్నారు.