పైరవీ లేకుండా పోలీసు సేవలు వినియోగించుకోండి
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:02 PM
ప్రజలు నిర్బయం గా, మూడో వ్యక్తి ప్రమేయం లే కుండా, ఎలాంటి పైరవీలు లేకుం డా స్వచ్ఛందంగా పోలీసు సేవల ను వినియోగించుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
గద్వాల క్రైం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రజలు నిర్బయం గా, మూడో వ్యక్తి ప్రమేయం లే కుండా, ఎలాంటి పైరవీలు లేకుం డా స్వచ్ఛందంగా పోలీసు సేవల ను వినియోగించుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవా రం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సమస్యలు తెలుసు కున్నారు. ఫిర్యాదులపై చట్టప్రకా రం చర్యలు తీసుకునేలా పోలీస్శాఖ కృషి చేస్తుందని చెప్పారు. మొత్తం 18 ఫిర్యాదులు అందాయ ని అధికారులు తెలిపారు. వాటి లో భూ వివాదాలకు సంబంధించి 14, వేధింపులకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించి 2 ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలీసు యం త్రాంగం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూనే ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ కమ్యూని టీ, ఇతర అవగాహన కార్యక్రమా లు నిర్వహిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా కృషి చేస్తామని అన్నారు.