పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:19 PM
జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికలను పారదర్శకం గా, స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించడానికి అఽధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల న్యూటౌన్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్ధానిక సంస్థల ఎన్నికలను పారదర్శకం గా, స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించడానికి అఽధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం ఐడీవోసీ సమావేశపుహాలులో ఫ్ల యింగ్ స్వ్కాడ్ బృందాలు, స్టాటిక్ సర్విలేయన్స్ బృందాలతో సమావేశం నిర్వహించి ఎన్నికల వి ధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్బం గా ఆయన మాట్లాడుతూ... జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయిందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి కౌంటింగ్ ముగిసేవరకు ఎ లాంటి అక్రమ చర్యలు జరుగకుండా నిరంతర పర్యవేక్షణ కోసం ప్లయింగ్స్వ్కాడ్లు, స్టాటిక్ సర్విలేయన్స్ టీమ్స్ ఏర్పా టు చేశామన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక ప్లయింగ్స్వ్కాడ్ చొప్పున మొత్తం 13 ప్లయింగ్స్వ్కాడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. 24/7 పర్యవేక్షణతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన, అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా, ప్రలోభాలు, బహుమతులు ఇవ్వడం వంటి వాటిని పకడ్బందీగా నియంత్రించాలన్నారు. ఎక్కడైనా సమస్యాత్మక ప్రదేశాలలో ప్రత్యేకమైన ప్లయింగ్ స్వ్కాడ్ టీంలు సకాలం లో చేరుకోలేని పక్షంలో కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని నలుమూలల చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో నాలుగు చెక్పోస్టుల వద్ద 12 స్టాటిక్ సర్విలేయన్స్ బృందాలను, మూడు సిఫ్టులలో చురుకుగా విధులు నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా వాహనాలలో రూ. 50వేలు, లేదా కొత్త వస్తువులు, రూ. 10వేల కంటే పైగా విలువైన బహుమతులు ఎక్కడైనా రవాణా అవుతున్నట్లు కనిపిస్తే స్పష్టమైన ఆధారా లు లేకుండా సందేహాస్పదంగా ఉంటే వెంటనే వాటిని సీజ్ చేయాలన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను పూర్తిగా వీడియో కవర్తో సీజ్ చేయాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సంబంధిత పోలీస్ స్టేషన్లో భద్రపరచాలన్నారు. తనిఖీలు మర్యాదపూర్వకంగా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతీ ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది ఉన్నారు.