Share News

చేయూత పింఛన్‌ పెంచి ఇవ్వాలి

ABN , Publish Date - Aug 25 , 2025 | 11:27 PM

దివ్యాం గులతో పాటు చేయూత పింఛన్‌ పెంచి పంపి ణీ చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రామ కృష్ణ డిమాండ్‌ చేశారు.

చేయూత పింఛన్‌ పెంచి ఇవ్వాలి
ఎంపీడీవో కార్యాలయం ఎదుట పింఛన్‌దారులతో కలిసి ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

జడ్చర్ల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) : దివ్యాం గులతో పాటు చేయూత పింఛన్‌ పెంచి పంపి ణీ చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రామ కృష్ణ డిమాండ్‌ చేశారు. జడ్చర్ల ఎంపీడీవో కా ర్యాలయం ముందు వృద్ధులతో కలిసి సోమవా రం ధర్నా నిర్వహించి, మాట్లాడారు. అధికారం లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా నేటి వరకు పింఛన్‌ పెంచలేదని ఆరోపించారు. అనంతరం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజే పీ నాయకులు బాలవర్దన్‌గౌడ్‌, నర్సిములు, ర మేశ్‌జీ, శ్రీనివాస్‌గౌడ్‌, శేఖర్‌ముదిరాజ్‌, మల్లేష్‌ యాదవ్‌, నరేశ్‌, కాశన్న, రమేశ్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 11:27 PM