సబ్సిడీ విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:14 PM
ప్రభుత్వం సబ్సిడీలో అందిస్తున్న విత్తనాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని పీఎసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు.
గద్వాల, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సబ్సిడీలో అందిస్తున్న విత్తనాలను రైతులు స ద్వినియోగం చేసుకోవాలని పీఎసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు. సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో జీలుగ విత్తనాల విక్రయా న్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ హన్మంతుతో కలిసి పీఎసీఎస్ చైర్మన్ సుభాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ ప్రభుత్వం 30 కేజీల జీలుగ విత్తనాలను సబ్సిడీలో రూ.2,137.50కు రైతులకు అందజేస్తుందన్నారు. పచ్చిరొట్ట ఎరువు వాడడం వల్ల పంటలకు పో షకాలు అంది నేల నల్లబారి నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. అలాగే వేరు వ్యవస్థ భూమిలోపలికి పటిష్టంగా పెరుగుతుం దని భూమిలోని నత్రజని శాతం పెరుగుతుంద ని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయశాఖ అధికారి ప్రతాప్ కుమార్, పీఎసీఎస్ సీఈవో వెంకటేశ్వర్రెడ్డి, రైతులు పాల్గొన్నారు.