నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలి
ABN , Publish Date - May 26 , 2025 | 11:44 PM
కొనుగోలు చే సి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట నే గోదాములకు తరలించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు.
గోపాల్పేట, మే 26 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు చే సి నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంట నే గోదాములకు తరలించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చే శారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడారు. రైతులు ధాన్యం విక్రయించేటప్పుడు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, పారదర్శకంగా ధాన్యం కొనుగో లు చేస్తారని అన్నారు. మండల ఏపీఎం సావి త్రి సెంటర్ సంబంధిత ఇన్చార్జిలతో మాట్లాడు తూ... ఐకేపీ కేంద్రాల్లోని కొనుగోలు అయిన ధా న్యాన్ని వెంటనే గోదాములకు తరలించారని ఆ దేశించారు. రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సెంటర్ను రద్దు చేసి, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో ని గోదాములను తనిఖీ చేశారు.