రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:22 PM
వనపర్తి పట్టణం లోని పీడీఎస్యూ జిల్లా కార్యాల యంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య వి ద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమా వేశాన్ని శనివారం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు.
వనపర్తి విద్యా విభాగం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి పట్టణం లోని పీడీఎస్యూ జిల్లా కార్యాల యంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య వి ద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమా వేశాన్ని శనివారం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సందర్భంగా విలేకరుల స మావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కా ర్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, ఎ.సాంబల మాట్లా డారు. విద్యారంగ సమస్యలపై రాజీలేని ఉద్య మాలను నిర్వహిస్తూ... సమాజంలో ఉన్న వివ క్షపై జరిగిన, జరుగుతున్న పోరాటాల్లో భాగస్వా మ్యం అవుతూ వస్తుందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర 4వ మ హాసభలను వనపర్తి జిల్లా కేంద్రంలో అక్టోబరు 28, 29, 30 తేదీల్లో నిర్వహించాలని పీడీఎస్ యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిం దన్నారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరి ష్కారం, కనీస వసతుల ఏర్పాటుకు ఉద్యమిం చాలన్నారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ను ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉం దని అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షు డు ఏ.సతీష్, ఆర్.రంజిత్, సహాయ కార్యదర్శు లు కే.గ ణేష్, కే.పవన్ పాల్గొన్నారు.