భక్తిశ్రద్ధలతో శ్రీనివాస కల్యాణం
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:15 PM
పట్టణంలోని కౌరంపల్లి శివారు లో వెలసిన తీర్థ వేంకటేశ్వర స్వామి ఆలయం లో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివా రం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు.
నారాయణపేట టౌన్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కౌరంపల్లి శివారు లో వెలసిన తీర్థ వేంకటేశ్వర స్వామి ఆలయం లో ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆదివా రం ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. స్వామి వారి భక్తి గీ తాలను లక్ష్మి శోభన భజన మండలి సభ్యుల ఆ ధ్వర్యంలో ఆలపించారు. అలాగే హనుమాన్ ఆ లయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కా ర్యక్రమంలో మేనేజర్ హరీష చారి, అర్చకులు కోప్రేష్ చారి, అనిరుధ్ చారి, రఘుప్రేమ్, తీర్థాచార్యులు, గోపీనాథ్, రవీంద్రచారి, దీపక్ తదితరులు పాల్గొన్నారు.