విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:42 PM
రా ష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అ న్నారు.
మదనాపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : రా ష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అ న్నారు. శుక్రవారం మండలంలోని కొన్నూరు గ్రా మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్, కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. విద్యాశాఖను స్వయంగా సీఎం చూడటంతో విద్యార్థులకు పాఠశాల తెరిచిన రో జే యూనిఫామ్, పుస్తకాలు అందజేశామని అ న్నారు. గత ప్రభుత్వంలో స్కూల్ యూనిఫా మ్స్ను కాంట్రాక్టర్లకు ఇచ్చి వాటిలో కమీషన్లు కూడా నొక్కారని అన్నారు. నూతనంగా 11,067 మంది టీచర్లను నియమించుకొని, గత ప్రభు త్వంలో మూతపడిన 136 పాఠాశాలలను తెరి చామన్నారు. ద్వారకనగరం, కొన్నూరు తండా విద్యార్థులకు రవాణా సౌకర్యం లేక రోజు సు మారు నాలుగు కిలోమీటర్ల మేర పాఠశాలకు వస్తున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు చెప్పగా వారికి త్వరలో సైకిళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకు ముందు మదనాపురం మార్కెట్ యా ర్డులో హమాలి బిల్డింగ్కు శంకుస్థాపన చేశారు. ఎంఈవో ఫారుక్ హుస్సేన్, శరత్రెడ్డి, ప్రశాంత్, తహసీల్దార్ మోహన్, ఎంపీడీవో ప్రసన్నకుమా రి, మహేష్కుమార్ పాల్గొన్నారు.