Share News

కురుమూర్తిస్వామిని దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:11 PM

పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

కురుమూర్తిస్వామిని దర్శించుకున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌
కురుమూర్తిలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మేఘారెడ్డి

సీసీకుంట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం తెలంగాణ శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకోగానే రాష్ట్ర పశుసంవర్ధక , క్రీడల శాఖా మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలయ ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, పాలకవర్గం సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభం, మేళతాలాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయ విశిష్ఠతను అర్చకులు వివరించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో స్పీకర్‌తో పాటు మంత్రి, ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ఈ ప్రభుత్వానికి స్వామి వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. మరో ఐదేళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలని స్వామివారు దీవించాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరవింద్‌కుమార్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు కతలప్ప, ప్రశాంత్‌, కాంగ్రెస్‌ నేతలు నరేందర్‌రెడ్డి, వట్టెం శివకుమార్‌ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్లు బందోబస్తును పర్యవేక్షించారు.

Updated Date - Nov 12 , 2025 | 11:11 PM