Share News

18న సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం

ABN , Publish Date - May 09 , 2025 | 11:23 PM

సౌర గిరి జల వికాస పథకాన్ని నల్లమల గిరిజన ప్రాంతంలో ఈ నెల 18 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించను న్నారు.

18న సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం
పెట్రాల్‌చేను గిరిజనుల భూములు పరిశీలిస్తున్న కలెక్టర్‌, అధికారులు

- హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

- పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

పదర/మన్ననూర్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): సౌర గిరి జల వికాస పథకాన్ని నల్లమల గిరిజన ప్రాంతంలో ఈ నెల 18 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించను న్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయం త్రం నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అమ్రాబాద్‌, పదర మండలాల్లో ఆదివాసీ చెంచు రైతులు సాగు చేసే పొలాలను పరిశీలించారు. అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు, వెంకటేశ్వర్ల బావి, మాచారం, పదర మండలంలోని పెట్రాల్‌ చేను ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్‌వోఎఫ్‌ పట్టా భూములను అటవీ శాఖ అధికారల సమక్షంలో పరిశీలిం చారు. సౌర గిరి జల వికాస పథకం గురించి సంబంధిత శాఖల అధికారులకు వివరిం చారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి, ప్రత్యేక అధికారి, డీటీటీవో ఫింరంగి, తహిసీల్దార్‌ సురేష్‌ బాబు, ఎంపీడీవో వెంకటయ్య, ఎఫ్‌ఆర్‌వో వీరేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:23 PM