Share News

విద్యారంగ సమస్యలపై అవిశ్రాంత పోరు

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:29 PM

విద్యారంగం సమస్యల పరి ష్కారం కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైన విద్యార్థి సంఘం ఏబీవీపీ అని యూనియ న్‌ అనుబంధ వరల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యూత్‌ వింగ్‌ నేషనల్‌ కన్వీనర్‌ నిఖిత అన్నారు.

విద్యారంగ సమస్యలపై అవిశ్రాంత పోరు

- ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

గద్వాల టౌన్‌/అయిజ టౌన్‌, వడ్డేపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విద్యారంగం సమస్యల పరి ష్కారం కోసం నిరంతర పోరాటం సాగిస్తున్న ఏకైన విద్యార్థి సంఘం ఏబీవీపీ అని యూనియ న్‌ అనుబంధ వరల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ యూత్‌ వింగ్‌ నేషనల్‌ కన్వీనర్‌ నిఖిత అన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం ప ట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక స్వా మి రామానందతీర్థ సర్కిల్‌ వద్ద యూనియన్‌ జెండాను ఎగురవేసి ఆమె మాట్లాడారు. స్వా మి వివేకానందుడి స్ఫూర్తితో అఖండ భారత్‌ ల క్ష్యంగా పనిచేస్తున్న ఏబీవీపీ ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు. సంస్థ ఆశయాల సాధన కో సం ప్రతివిద్యార్థి నిబద్ధతతో కృషి చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆంజనేయులు, నరేష్‌, రఘు వంశీ, తేజ, సురేష్‌, సాయి సత్యారెడ్డి, నితిన్‌, రమేశ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:29 PM