Share News

గంగను విడువు శివయ్యా..

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:34 PM

వరుణ దేవుడు కరుణించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దఆములపాడులో రైతులు, ప్రజలు సోమవారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

గంగను విడువు శివయ్యా..
కృష్ణానది నుంచి నీటిని తీసుకువస్తున్న పెద్దఆముదాలపాడు గ్రామస్థులు

- పెద్దఆములపాడులో కృష్ణా, తుంగభద్ర జలాభిషేకం

మానవపాడు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): వరుణ దేవుడు కరుణించాలని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని పెద్దఆములపాడులో రైతులు, ప్రజలు సోమవారం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంలో గ్రామస్థులు కొందరు బీచుపల్లి దగ్గర ప్రవహిస్తున్న కృష్ణానది నీటిని తీసుకు రాగా, మరికొందరు తుంగభద్ర నది నీటిని పంచలింగాల వద్ద తీసుకువచ్చి శివుడికి జలాభిషేకం చేశారు. గ్రామంలోని శివుడికి ఈ విధంగా పూజలు చేస్తే ప్రకృతి కరుణిం చి రైతు అనుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 21 , 2025 | 11:34 PM