Share News

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:25 PM

ప్రజావాణి ఫిర్యాదులకు ఎప్పటి కప్పుడు పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు అధికారులకు సూచిం చారు.

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జూలై7 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులకు ఎప్పటి కప్పుడు పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు అధికారులకు సూచిం చారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీక రించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మా ట్లాడుతూ... ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పు డు స్పందిస్తు, ఫిర్యాదుదారులకు తగిన సమా చారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యా దులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించా లని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 50 ఫి ర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల అధికారు లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:25 PM