దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:36 PM
దోమల వ్యాప్తిని అరికట్టడంతో మలేరియా వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేయవ చ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అ ల్లే శ్రీనివాసులు అన్నారు.
వనపర్తి వైద్యవిభాగం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : దోమల వ్యాప్తిని అరికట్టడంతో మలేరియా వ్యాధి నివారణకు అడ్డుకట్ట వేయవ చ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అ ల్లే శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జి ల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. నేటికీ ప్రతీ ఏ డాది మలేరియా మహమ్మారి కారణంగా మర ణాలు సంభవిస్తూనే ఉన్నాయని అన్నారు. మ లేరియా వ్యాధి సోకడానికి ముఖ్యంగా ఆడ అన్నాఫినెస్ అనే దోమ కుట్టడంతో వస్తుందన్నా రు. మలేరియా వ్యాధికి ముందస్తు రాడికల్ చికి త్స ద్వారా మరణాలను తగ్గించవచ్చన్నారు. ప్ర తీ శుక్రవారం ప్రైడే డ్రైడేను పాటించాలని సూ చించారు. అనంతరం మలేరియా వ్యాధి నివార ణపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సాయినాథ్రెడ్డి, డాక్టర్ పరిమళ, డాక్టర్ మారుతి నందన్గౌడ్, శ్రీనివాస్జీ పాల్గొన్నారు.