దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంచాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:12 PM
కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హా మీ ప్రకారం నెలకు రూ.6వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ
పాలమూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హా మీ ప్రకారం నెలకు రూ.6వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫంక్షన్హాలులో దివ్యాం గుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. ఆగస్టు 13న దివ్యాం గులకు చేయూత పెన్షన్ మహాగర్జనను విజ యవంతం చేయడానికి సన్నాహక సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మహాగర్జనకు అ ధికసంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు. కాళ్ల జంగన్న, నరేందర్, బుచ్చయ్య నాయక్, చెన్నకేశవులు, శ్రీనివాసులు, జయ పాల్రెడ్డి, యాదయ్య, నాగరాజు, మైలారం శ్రీరాములు, మారెపల్లి రాంచందర్ తది తరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హమీ నెరవేర్చాల్సిందే
ధన్వాడ: ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్రెడ్డి దివ్యాంగులకు ఫించన్ పెంచుతా మని చెప్పి ఇంత వరకు చేయలేదని ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఆదివారం జిల్లా దివ్యాంగుల సమావేశం నిర్వహించారు. ప్ర భుత్వం ఏర్పడి 19 నెలలు అవుతున్నా.. నేటి కి ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదన్నారు. అం తకు ముందు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నర్సింహులు, రాజు, తిమ్మయ్య, నరేందర్, మాసమ్మ తది తరులు పాల్గొన్నారు.