బస్టాండ్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 04 , 2025 | 10:46 PM
బస్టాండ్ లో దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోస్గి ఎస్ఐ బాల్రాజ్ కోరారు.
- ఎస్ఐ బాల్రాజ్
కోస్గి మే 4 (ఆంధ్రజ్యోతి): బస్టాండ్ లో దొంగతనాల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోస్గి ఎస్ఐ బాల్రాజ్ కోరారు. ఆదివా రం కోస్గి బస్టాండ్లో ఆయన పలువురి నుంచి వేలిముద్రలను సేకరించారు. ప్రయాణికులు బస్సు ఎక్కే, దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికుల మాటున దొంగతనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎస్పీ ఆదేశాలతో బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.