అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 11:36 PM
అన్నిరకాల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని, మైనార్టీ విద్యార్థులు తమకు అందిం. గురుకుల విద్యాభాస అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ జలీల్ అహ్మద్ సూ చించారు.
రిటైర్డ్ ప్రిన్సిపాల్ జలీల్ అహ్మద్
గద్వాల టౌన్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అన్నిరకాల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని, మైనార్టీ విద్యార్థులు తమకు అందిం. గురుకుల విద్యాభాస అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ జలీల్ అహ్మద్ సూ చించారు. గద్వాల పట్టణంలోని తెలంగాణ మైనార్టీ గు రుకుల పాఠశాలలో ఆదివారం ఫ్రెషర్స్ డే కార్య క్రమం ఉత్సహంగా నిర్వహించారు. ఈ సంద ర్బంగా మాట్లాడిన ప్రిన్సిపాల్ భవాని, గురుకులాల్లో అవకాశం దక్కిన నూతన విద్యా ర్థులు తమ సీనియర్స్ ద్వారా క్రమశిక్షణ పద్ధ్దతులను అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వం అన్నివిధాలా కల్పించిన సౌకర్యాన్ని అందుకుం టూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆ కాంక్షించారు. గురుకుల చెందిన పూర్వ విద్యార్థులు 2024-25లో ప్రతిభ చాటిన వారికి కళాశాల తరఫున జ్ఞాపికలను అందజేసి వారి తల్లిదం డ్రులను సన్మానించారు. కార్యక్రమంలో మై నార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కోఆర్డినేటర్ సలీం, అతిక్ఉర్ రెహమాన్, పాఠశాల కమిటీ సభ్యులు ఉన్నారు.