పిల్లలను కాపాడబోయి.. కాలువలో పడి వృద్ధుడి మృతి
ABN , Publish Date - May 04 , 2025 | 11:16 PM
మండ లంలోని కుడికిల్ల గ్రామంలో ఆరేపల్లి శ్రీరాము లు (60) ప్రమాదవశాత్తు కేఎల్ఐ ప్రధాన కా లువలో పడి మృతి చెందాడు.
పిల్లలను కాపాడబోయి..
కాలువలో పడి వృద్ధుడి మృతి
కొల్లాపూర్, మే 4 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని కుడికిల్ల గ్రామంలో ఆరేపల్లి శ్రీరాము లు (60) ప్రమాదవశాత్తు కేఎల్ఐ ప్రధాన కా లువలో పడి మృతి చెందాడు. గ్రామస్థులు తెలి పిన వివరాల ప్రకారం.. శ్రీరాములు గ్రామ స మీపంలో ఉన్న కేఎల్ఐ ప్రధాన కాలువకు తమ చిన్న కుమారుడి పిల్లలు ఆంజనేయులు, కుమార్లను తీసుకుని ఈత నేర్పించడానికి వె ళ్లాడు. పిల్లలకు ఇద్దరికి వాటర్ బాటిళ్లు కట్టి కా లువలో ఈతకు దించాడు. శ్రీరాములు మాత్రం పైన కాలువ గట్టున ఉన్నాడు. పిల్లలకు కట్టిన బాటిళ్లు ఊడిపోవడంతో ఇద్దరు పిల్లలు ప్రమా దంలో ఉన్నారని కాలువలోకి వారిని రక్షించే ప్ర యత్నంలో పిల్లలను గెట్టుకు తోసి ఆయనకు ఊపిరి ఆడక మునిగిపోయాడు. కాలువ గట్టున మృతుని కూతురు ఎల్లమ్మ చూసి పిల్లలను పై కి ఎక్కించి తండ్రిని రక్షించడానికి పొలాల్లో ఉ న్న వారిని పిలిచింది. అత్నన బయటికి తీసి కొ ల్లాపూర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారు.