Share News

రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:29 PM

వివిధ సందర్భాల్లో ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దహనం చేశారు.

 రూ.1.5 కోట్ల విలువైన మత్తు పదార్థాల దహనం
మత్తు పదార్థాలను పరిశీలిస్తున్న అధికారులు

మహ బూబ్‌నగర్‌, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : వివిధ సందర్భాల్లో ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.50 కోట్ల విలువైన మత్తు పదార్థాలను దహనం చేశారు. ఉమ్మడి జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయభాస్కర్‌రెడ్డి నేతృత్వంలో, డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ సూచనలు, జిల్లా ఎక్సైజ్‌ అధికారి సుధాకర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 3.5 కిలోల ఎండు గంజాయి, 13.5 కిలోల అల్ర్పాజోలం, 5.8 కిలోల డైజోఫాంలను షాద్‌నగర్‌ దగ్గరున్న జె మల్టీ క్లేవ్‌ బాయిలర్‌ కంపెనీలో కాల్చి బూడిద చేశారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ అధికారి నరసింహ్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:29 PM