బైక్ అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతి
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:36 PM
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి సమీపంలో బైక్పై వస్తున్న రమేష్ చారి(38) అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

బిజినేపల్లి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని శాయిన్పల్లి సమీపంలో బైక్పై వస్తున్న రమేష్ చారి(38) అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడి మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలం లోని వెల్గొండ గ్రామానికి చెందిన మృతుడు వనపర్తి నుంచి బిజినేపల్లి వైపు బైక్పై స్నేహితుడితో కలిసి వస్తున్న రమేష్చారి బైక్ అదుపు తప్పి కిందపడటంతో అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గా యాల పాలయ్యాడు. 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే నాగర్కర్నూ ల్ జిల్లా ఆసుపత్రికి తరలించనట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మం డల కేంద్రంలో ఉన్న బంగారం షాపులో పనిచేస్తుంటాడని తెలిపారు.