బాధితులకు వేగంగా న్యాయం చేయాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:00 PM
జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత న్యాయాధికారులతో సమన్వయం చేసుకుని బాధితులకు వేగంగా న్యాయం చేకూర్చేలా ప్రతీ ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం
సమీక్ష సమావేశంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత న్యాయాధికారులతో సమన్వయం చేసుకుని బాధితులకు వేగంగా న్యాయం చేకూర్చేలా ప్రతీ ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈనెల 15న జరుగనున్న స్పెషల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆదేశించారు. గురు వారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరె న్స్ హాలులో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. రాజీ పడదగిన కేసులతో గుర్తించి లోక్ అదాలత్లో పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చిన్న చిన్న వివాదాలను కోర్టుల వర కు తీసుకెళ్లకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించడం సమాజానికి మేలు చేస్తుందన్నా రు. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో నిందితులపై దృఢమైన ఆధారాలతో త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకొని కన్విక్షన్ రేటును పెంచాలని సూచించారు. కేసుల పురోగతిని నిరంతరం పరిశీలించి, అవసరమైతే ఉన్నతాధికారుల సలహా లు తీసుకొని ముందుకు సాగాలన్నారు. బాధితులకు న్యాయం చేకూర్చడమే మన ప్రధాన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, గద్వాల, అలంపూర్, శాంతినగర్ సీఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు ఉన్నారు.