Share News

ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:22 PM

తమ ఉద్యోగాలను రె గ్యులరైజ్‌ చేయాలని కోరుతూ గద్వా ల శివారు నదీఅగ్రహారంలో ఉన్న పా లమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్‌ ఎదుట ఒప్పంద అధ్యా పకులు గురువారం విధులు బహిష్క రించి నిరసనకు దిగారు.

ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయాలి

గద్వాల సర్కిల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తమ ఉద్యోగాలను రె గ్యులరైజ్‌ చేయాలని కోరుతూ గద్వా ల శివారు నదీఅగ్రహారంలో ఉన్న పా లమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెంటర్‌ ఎదుట ఒప్పంద అధ్యా పకులు గురువారం విధులు బహిష్క రించి నిరసనకు దిగారు. వీరికి బోధనేతర సిబ్బంది, విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల ఒప్పంద అధ్యాపకుల (అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు) జేఏసీ పిలుపుమేరకు చేపట్టిన ఈ నిరసన లో ఒప్పంద అధ్యాపకులు మాట్లాడు తూ ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించినట్లుగా తమ ఉద్యోగాలను కూడా రాష్ట్ర ప్రభు త్వం క్రమబద్ధీకరించాలని కోరారు. కార్య క్రమంలో శ్రీనివాసులు, మహేందర్‌, గోపీనాథ్‌ రాథోడ్‌, గణేష్‌, పార్ట్‌ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:22 PM