విచారించి సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:36 PM
రైతు లకు సంబంధించిన భూసమస్యలను పరిష్కరిం చడానికే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వ హిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపా రు.
- కలెక్టర్ విజయేందిరబోయి
మూసాపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రైతు లకు సంబంధించిన భూసమస్యలను పరిష్కరిం చడానికే భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వ హిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిరబోయి తెలిపా రు. గురువారం మండలంలోని కాటవరంలో భూభారతి రెవెన్యూ సదస్సులో ఆమె పర్య వేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు జిల్లా వ్యాప్తం గా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ సమ స్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, తదుపరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరి ష్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, నయాబ్ తహసీల్దార్ ఖలీద్ బీన్ ఎగ్బాల్, శశివర్థన్, సృజన్కుమార్ తది తరులు పాల్గొన్నారు.