ఘనంగా అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:24 PM
పట్టణం లోని నల్లజానమ్మ ఆలయం నుంచి పట్టణ పుర వీధుల గుండా అంబేడ్కర్ చౌరస్తా వరకు 200 మంది క్రీడాకారులచే ఒలింపిక్డే ర్యాలీ ఆదివా రం నిర్వహించారు.
మక్తల్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : పట్టణం లోని నల్లజానమ్మ ఆలయం నుంచి పట్టణ పుర వీధుల గుండా అంబేడ్కర్ చౌరస్తా వరకు 200 మంది క్రీడాకారులచే ఒలింపిక్డే ర్యాలీ ఆదివా రం నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ చౌర స్తాలో సీఐ రాంలాల్, నిర్వాహణ చైర్మన్ గోపా లం మాట్లాడుతూ క్రీడాకారులు రాణించి జాతీ య స్థాయిలో ఎదగాలన్నారు. ఒలింపిక్ క్రీడల ద్వారా గౌరవం, శాంతి, ఐక్యత ప్రోత్సహించడం వంటివి ఏర్పడుతాయన్నారు. అంతకు ముందు నల్లజానమ్మ ఆలయం వద్ద కాగడాలు వెలిగించి క్రీడా పరుగును ప్రారంభించారు. అంతకు ముందు జాతీయ స్థాయి క్రీడాకారులను సన్మా నించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడ ల అధికారి వెంకటేష్శెట్టి, పీడీలు రూప, మీనా కుమారి, పీఈటీలు అంబ్రేష్, దామోదర్, రమే ష్, జగదీష్, మంజుల, వెంకటేష్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.