Share News

ర్యాలంపాడు పునరావాస కేంద్రం పరిశీలన

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:04 AM

మండల పరిధిలోని ర్యాలంపాడు నూతన పున రావాస కేంద్రాన్ని ఆదివారం వనపర్తి డివిజన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌, ధరూర్‌ మండల వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

ర్యాలంపాడు పునరావాస కేంద్రం పరిశీలన
వనపర్తి డివిజన్‌ చీఫ్‌ ఇంజనీర్‌కు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

  • చీఫ్‌ ఇంజనీర్‌కు సమస్యలను ఏకరువు పెట్టిన గ్రామస్థులు

ధరూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ర్యాలంపాడు నూతన పున రావాస కేంద్రాన్ని ఆదివారం వనపర్తి డివిజన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాగేందర్‌, ధరూర్‌ మండల వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గ్రామస్థులతో మాట్లాడిన వన పర్తి డివిజన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు కల్పించాలని, రోడ్డు, నీరు, డ్రైనేజీ, క రెంట్‌ ఇతర సమస్యలు ఉన్నాయని గ్రామస్థులు చీఫ్‌ ఇంజనీర్‌కు వివరించారు. అనంతరం గ్రా మస్థులు చీఫ్‌ ఇంజనీర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ రహిముద్దీన్‌, గ్రామ మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నిర్వాసిత కమిటీ సభ్యులు ఉన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 12:04 AM