ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ABN , Publish Date - May 10 , 2025 | 12:04 AM
ఇందిరమ్మ ఇ ళ్ల పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల న్యూటౌన్, మే 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇ ళ్ల పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్ర వారం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కాన్ఫరెన్స్ హా ల్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం ప థకం, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిని మండలాల వారీగా సమీక్షిస్తూ, మంజూరైన ఇళ్లనిర్మాణ పనుల్లో గ్రౌం డింగ్, బేస్మెంట్, మార్క్అవుట్, రీ-వెరిఫికేషన్ తదితర అంశాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన కలెక్ట ర్, నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యే వి ధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాలని, తక్కు వ ఖర్చుతో ఇళ్లనిర్మాణ విధానాన్ని లబ్ధిదారుల కు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికా రులను ఆదేశించారు. ఇళ్లనిర్మాణ పురోగతి వివ రాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్యాప్లో నమో దు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచిం చారు. నిర్మాణ దశలను బట్టి దశలవారీగా లబ్ధి దారులకు వారి ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేస్తాన్నారు. మునిసిపాలిటీలో అధికారు లు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హులకు ఇళ్ల నిర్మాణాలపై సూచనలు అందించాలని, ప నులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నా రు. అలాగే రాజీవ్ యువవికాసం పథకం వచ్చి న దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అర్హుల ఎంపిక సమయంలో ఆధార్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు అన్ని అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ప్ర క్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధి కారులకు సూచించారు. అకాల వర్షాల కారణం గా వడ్లు తడవకుండా టార్పాలిన్ పట్టాలు అం దుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, పౌర సరఫరాల అధికారి స్వామికుమార్, డీఎం విమ ల, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.