తీగ పందిరి పంటలతో అధిక లాభాలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:24 PM
రై తులకు కూర గా యలు సాగుతో చాలా లాభాలు వస్తాయని కలెక్ట ర్ సిక్తా పట్నా యక్ సూచిం చారు.
- కలెక్టర్ సిక్తా పట్నాయక్
దామరగిద్ద, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రై తులకు కూర గా యలు సాగుతో చాలా లాభాలు వస్తాయని కలెక్ట ర్ సిక్తా పట్నా యక్ సూచిం చారు. మంగళవారం కలెక్టర్ దామరగిద్ద మండల పరిధిలోని మద్దెలబిడ్ గ్రామ శివారులో శంకర్ అనే రైతు తన పొలంలో తీగపందిరి పద్ధతిలో సాగు చేసిన కాకరకాయ, సోర, టమోట పంటలను పరిశీలించారు. రైతులకు ఇంకా మెరుగైన పంటలకు ప్రభుత్వం తరపున నుంచి హనిబాక్స్లపై అవగాహన కల్పించి రైతు లకు అందిస్తామన్నారు. అనంతరం గత్ప గ్రామంలో నిర్వహిస్తున్న భూభారతి రైతు సదస్సు కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ఫిర్యాదులు అందాయి? వచ్చిన వాటిని పరిశీలించి నోటిసు ఇవ్వాలని, 7 రోజుల్లో వాటిని పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని మంజూరయ్యాయి... అందులో గ్రౌండింగ్ ఎంత అయింద ని అధికారులను అడిగి తెలుసు కున్నారు. దామరగిద్ద కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాఠశాల ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్నా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానుకుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ యోగాడే సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ క్యాంపును కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 21వ తేదీన యోగా డే సంద ర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉపాధి హామీ అధికారులు పాల్గొన్నారు.