బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
ABN , Publish Date - May 09 , 2025 | 10:58 PM
ఆకస్మిక మృతి చెందిన జిల్లా జర్నలిస్టులు యాదగిరి, మహేశ్, రాఘవేందర్ కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంద జేశారు.

నారాయణపేటటౌన్, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆకస్మిక మృతి చెందిన జిల్లా జర్నలిస్టులు యాదగిరి, మహేశ్, రాఘవేందర్ కుటుంబాలకు జర్నలిస్టు సంక్షేమ నిధి నుంచి మంజూరైన రూ.లక్ష చెక్కును శుక్రవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంద జేశారు. హైదరాబాద్లోని మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ భవన్లో నిర్వహించిన ‘జర్నలి స్టుల సంక్షేమం - ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం’ అనే కార్యక్రమంలో జిల్లాకు చెందిన చెందిన ముగ్గురు జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబాల్లో విద్యార్థుల చదువు కోసం ప్రతీనెల రూ.1000, మృతుడి భార్యకు ప్రతీనెల రూ.3 వేల పెన్షన్ అందనుందని టీయూడబ్ల్యూజే ఐజేయూ నారా యణపేట జిల్లా అధ్యక్షుడు కోయిల్కొండ నారా యణరెడ్డి తెలిపారు. అలాగే ఇటీవల మృతి చెం దిన ఊట్కూరు మండల ఉర్దూ రిపోర్టర్కు వీలై నంత త్వరగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈనెల చివరి వరకు పేట జిల్లాకు చెందిన జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్ క్యాంపు నిర్వహించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విర హాత్అలీ, కార్యదర్శి మధుగౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, దిశా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బ్యూరో చేగూరి నరసింహులు, రఘు, గణప, నక్క శ్రీనివాస్, ఆకుల రాజేష్, సంజీవ, ప్రకాష్, విఠోభా తదితరులున్నారు.