జోగుళాంబను దర్శించుకున్న సినీ హీరో ఆది
ABN , Publish Date - May 04 , 2025 | 11:20 PM
జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తనయుడు ఆది ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అలంపూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయికుమార్ తనయుడు ఆది ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు స్వామి వారి ఆలయంలో గణపతి పూజ అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన వంటి విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.