పంట సాగు విధానంపై రైతులకు అవగాహన
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:43 PM
మండలంలోని అప్పారెడ్డిపల్లిలోని రైతు వేదిక లో రైతులకు పంటల సాగు విధానంపై శుక్రవా రం మండల వ్యవసాయ శాఖ అధికారి మల్ల య్య అవగాహన కల్పించారు.
ఖిల్లాఘణపురం, జూలై11(ఆంధ్రజ్యోతి) : మండలంలోని అప్పారెడ్డిపల్లిలోని రైతు వేదిక లో రైతులకు పంటల సాగు విధానంపై శుక్రవా రం మండల వ్యవసాయ శాఖ అధికారి మల్ల య్య అవగాహన కల్పించారు. పంట సాగు స మయంలో రైతులు ఎదుర్కొనే సవాళ్లను పరి ష్కరించే జాగ్రత్తలను వివరించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్.ఎఫ్.ఎస్.ఎం) పథ కం ద్వారా కందులు 120 కిలోలు, జొన్న 300 కి లోలు, మినుములు 80 కిలోలు, రాగి 25 కిలో లు పంటలకు సంబంధించిన చిరుధాన్యం సం చులను రైతులకు రాయితీతో అందించడానికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో సిద్ధంగా ఉ న్నాయని తెలిపారు. వానాకాలంకు సంబంధిం చి చిరు ధాన్యపు విత్తనాలు అవసరం ఉన్న రై తులు మండల వ్యవసాయ శాఖ అధికారి కా ర్యాలయంలో రాయితీతో విత్తనాలు పొందవచ్చ ని తెలిపారు. గ్రామంలోని రైతులకు జొన్నలు, కందులు, చిరు ధాన్యం బస్తాలను పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ కృష్ణయ్య యాదవ్, రైతులు నరసింహారెడ్డి, కృష్ణయ్య, ఏ ఈవోలు రైతులు తదితరులు పాల్గొన్నారు.