గ్రామపాలన అధికారుల పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - May 23 , 2025 | 11:25 PM
జిల్లాలో మే 25న నిర్వహించనున్న గ్రామ ప రిపాలన అధికారుల స్ర్కీనింగ్ ప రీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు ఆదేశించారు.

వనపర్తి రాజీవ్చౌరస్తా, మే 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మే 25న నిర్వహించనున్న గ్రామ ప రిపాలన అధికారుల స్ర్కీనింగ్ ప రీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని అదనపు కలెక్టర్ వెంకటేశ్వ ర్లు ఆదేశించారు. ఈ పరీక్ష నిర్వ హణ అంశంపై శుక్రవారం ఆయ న తన చాంబర్లో అధికారులతో మాట్లాడారు. వనపర్తి జిల్లా నుం చి 97 మంది వీఆర్వోలు, వీఆర్ ఏలు దరఖాస్తు చేసుకోగా.. వారికి మే 25న ఆ దివారం రాత పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పా రు. పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ర్టా నిక్ వస్తువులు వెంట తీసుకురావడానికి వీలు లేదని సూచించారు. అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలో అ నుమతించడం జరుగుతుందని 10 గంటల త రువాత ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అ నుమతి లేదని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఉమామహేశ్వర రావు, ఏవో భాను ప్రకాష్, సా ్థనిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, పరీక్ష కేంద్రం చీ ఫ్ సూపరింటెండెంట్, మునిసిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.